Share News

దుబాయ్‌ బయల్దేరిన మేడ్చల్‌ కౌన్సిలర్లు

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:38 PM

ముందు నుంచి అందరు ఊహించిన మాదిరిగానే మేడ్చల్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లు దుబాయ్‌ విహార యాత్ర కోసం బుధవారం సాయంత్రం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విమానం ఎక్కారు.

దుబాయ్‌ బయల్దేరిన మేడ్చల్‌ కౌన్సిలర్లు
ఎయిర్‌పోర్టులో మేడ్చల్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లు, కౌన్సిలర్ల భర్తలు

మేడ్చల్‌ టౌన్‌, జనవరి 17: ముందు నుంచి అందరు ఊహించిన మాదిరిగానే మేడ్చల్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లు దుబాయ్‌ విహార యాత్ర కోసం బుధవారం సాయంత్రం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విమానం ఎక్కారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ యాత్రలో పాల్గొనే కీలక వ్యక్తి మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కొందరు నేతలతో ఒక రోజు మందు మంగళవారం సాయంత్రం దుబాయికి చేరుకున్నారు. కాగా బుఽధవారం మేడ్చల్‌ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు పట్టణం బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్‌, మాజీ ఉపసర్పంచ్‌ మర్రి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బయల్దేరారు. నేతలు ఫ్టైట్‌ ఎక్కేముందు దిగిన ఫొటోను సామాజిక మాద్యమాల్లో పోస్టులు చేయడం గమనార్హం.

Updated Date - Jan 17 , 2024 | 11:38 PM