వివాహిత అదృశ్యం
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:27 AM
భర్తతో తలెత్తిన విభేదాలతో తల్లిగారింటికి వచ్చిన వివాహిత అదృశ్యమెంది. ఈ ఘటన మండలంలోని మోమిన్కలాన్లో చోటుచేసుకుంది.

ధారూరు, జూన్ 16: భర్తతో తలెత్తిన విభేదాలతో తల్లిగారింటికి వచ్చిన వివాహిత అదృశ్యమెంది. ఈ ఘటన మండలంలోని మోమిన్కలాన్లో చోటుచేసుకుంది. ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మోమిన్కలాన్ గ్రామానికి చెందిన బంటు తారబి కూతురు షబానా బేగం(40 సంవత్సరాలు)కి వికారాబాద్కు చెందిన తాజుద్దీన్తో 13సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. కాగా షబానా బేగంకు భర్త తాజుద్దీన్తో విభేదాలు తలెత్తటంతో గత నెలలో పుట్టింటికి వచ్చి తల్లి తారబితో ఉంటోంది. కాగా ఈనెల 14న తెల్లవారుజామున షబానా బేగం తల్లిగారింటి నుంచి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం భర్తతో పాటు బంధువులను ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆదివారం తల్లి తారబి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.