రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Feb 28 , 2024 | 12:32 AM
బస్సు ఎక్కుతూ కాలుజారి పడటంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మోమిన్పేట్ మండలంలో చోటుచేసుకుంది.
![రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు](https://media.andhrajyothy.com/media/2024/20240227/rr_2199faef5f.jpg)
మోమిన్పేట్, ఫిబ్రవరి 27: బస్సు ఎక్కుతూ కాలుజారి పడటంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మోమిన్పేట్ మండలంలో చోటుచేసుకుంది. మొరంగపల్లి బస్టాండ్లో కడిచర్ల గ్రామానికి చెందిన వ్యక్తి సాలె వెంకటయ్య మంగళవారం మోమిన్పేట్ నుంచి కడిచర్ల గ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో జారి పడిపోయాడు. దీంతో రెండు కాళ్లపై నుంచి బస్సు వెళ్లడంతో రెండు కాళ్లూ విరిగిపోయాయి. అతన్ని వెంటనే 108 వాహనంలో వికారాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.