Share News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:32 AM

బస్సు ఎక్కుతూ కాలుజారి పడటంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మోమిన్‌పేట్‌ మండలంలో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

మోమిన్‌పేట్‌, ఫిబ్రవరి 27: బస్సు ఎక్కుతూ కాలుజారి పడటంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మోమిన్‌పేట్‌ మండలంలో చోటుచేసుకుంది. మొరంగపల్లి బస్టాండ్‌లో కడిచర్ల గ్రామానికి చెందిన వ్యక్తి సాలె వెంకటయ్య మంగళవారం మోమిన్‌పేట్‌ నుంచి కడిచర్ల గ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో జారి పడిపోయాడు. దీంతో రెండు కాళ్లపై నుంచి బస్సు వెళ్లడంతో రెండు కాళ్లూ విరిగిపోయాయి. అతన్ని వెంటనే 108 వాహనంలో వికారాబాద్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ అజాగ్రత్తతోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 28 , 2024 | 09:14 AM