Share News

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:06 AM

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని చేవెళ్ల అసెంబ్లీ ఇన్‌చార్జి పామెన భీం భరత్‌ అన్నారు. శుక్రవారం షాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు తొంట వెంకటయ్య, గ్రామస్తులు పెద్ద ఎత్తున కాం గ్రెస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం
కాంగ్రెస్‌ నేత పామెన భీం భరత్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

షాబాద్‌, మార్చి 8 : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని చేవెళ్ల అసెంబ్లీ ఇన్‌చార్జి పామెన భీం భరత్‌ అన్నారు. శుక్రవారం షాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు తొంట వెంకటయ్య, గ్రామస్తులు పెద్ద ఎత్తున కాం గ్రెస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు కృషిచేద్దామన్నా రు. పార్టీ కోసం కష్టపడినవారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.500 గ్యాస్‌ సిలిండర్ల పథకాలను ప్రారంభించామని, త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం ప్రారంభిస్తారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి పీసరి సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, అశోక్‌, నాయకులు టి.రవీందర్‌, మంగళి చెన్నయ్య, గడ్డం చంద్రయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 12:06 AM