Share News

కనుల పండువగా లక్ష పుష్పార్చన

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:08 AM

కీసరలోని శ్రీ సీతారామచంద్రస్వామి, లక్ష్మణ, ఆంజనేయ ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు వెంపటి ప్రభాకర్‌శర్మ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఆలయంలోని మూలవిరాట్‌కు అభిషేకం, సుదర్శన హోమం నిర్వహించారు.

కనుల పండువగా లక్ష పుష్పార్చన
లక్ష పుష్పార్చనలో పాల్గొన్న భక్తులు

కీసర, ఏప్రిల్‌ 11 : కీసరలోని శ్రీ సీతారామచంద్రస్వామి, లక్ష్మణ, ఆంజనేయ ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు వెంపటి ప్రభాకర్‌శర్మ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఆలయంలోని మూలవిరాట్‌కు అభిషేకం, సుదర్శన హోమం నిర్వహించారు. అనంతరం స్వామివార్ల ఉత్సవమూర్తులకు వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చన నిర్వహించారు. గ్రామంలోని పలువురు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 12:09 AM