Share News

కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలి

ABN , Publish Date - May 03 , 2024 | 12:05 AM

బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపునకు అందరూ కష్టపడి పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి నారాయణలాల్‌ పంచారియ అన్నారు.

కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలి
అజీజ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూన్న రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి నారాయణలాల్‌ పంచారియ

  • రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి నారాయణలాల్‌ పంచారియ

మొయినాబాద్‌ రూరల్‌/ధారూరు/కందుకూరు/చేవెళ్ల/ మహేశ్వరం, మే 2: బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపునకు అందరూ కష్టపడి పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి నారాయణలాల్‌ పంచారియ అన్నారు. మండలంలోని అజీజ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనాయకుల సమావేశాన్ని మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఆయన పాల్గోని మాట్లాడారు. రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారని పూర్తి వివరాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. బీజేపీకి ప్రస్తుతం 400 సీట్లు ఉన్నాయని రిజర్వేషన్ల జోలికి పోలేదని ప్రజలు గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బంటు జ్ఞానేశ్వర్‌, బట్టు రాజమల్లేష్‌, సుధాకర్‌రెడ్డి, మాదవరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రవి, రాజు గౌడ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ధారూరు మండలంలోని నాగారం, అంతారం గ్రామాల్లో బీజేపీ నాయకులు పర్యటించి బీజేపీ ఎంపీ అభ్యర్థి కె.విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాండుగౌడ్‌, వివేకానందరెడ్డి, నందు, రాజునాయక్‌, రమేశ్‌, నరేందర్‌రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి కోరారు. గురువారం ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు, కొత్తగూడ మాజీ సర్పంచ్‌ సాధ మల్లారెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతి, దయాకర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, హన్మంత్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, రవీందర్‌, పి.చెన్నకృష్ణ, శ్రీపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా చేవెళ్ల మండలంలోని ముడిమ్యల్‌లో ఎంపీపీ మాల్గారి రమణారెడ్డి, చేవెళ్ల మండల అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివా్‌సగుప్తా, శర్వలింగం, శ్రీనివా్‌సరెడ్డి, ఆంజనేయులుగౌడ్‌, శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి, వైభవ్‌రెడ్డి, శ్రీనివాస్‌, మధుకర్‌రెడ్డి, మచ్చేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. తుక్కుగూడ మున్సిపల్‌ పరిధిలో తుక్కుగూడ మున్సిపల్‌ బీజేపీ అద్యక్షుడు రచ్చలక్ష్మణ్‌ ప్రచారం నిర్వహించారు.

బీజేపీలో చేరికలు

మోమిన్‌పేట్‌/తాండూరు రూరల్‌: మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం బీజేపీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు కె.మాధవరెడ్డి సమక్షంలో మేకవనంపల్లి, ఎన్కెపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రమేశ్‌ ముదిరాజ్‌, వెంకట్‌రెడ్డి, పాండుగౌడ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా తాండూరు మండలంలోని జినుగుర్తి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు బీజేపీ కార్యవర్గ సభ్యులు శేఖాపురం ఆంజనేయులు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరగా, కండువాకప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బీఆర్‌ఎస్‌ యువజన సంఘం అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, కాంగ్కెస్‌ సీనియర్‌ నాయకులు ముదిరాజ్‌ శ్రీనివాస్‌, వడ్డెర సంఘం అధ్యక్షుడు వీరేశం, రాములు, నర్సింహులు చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యవర్గ సభ్యుడు యు.రమేష్‌కుమార్‌, బీజేపీ మండల అధ్యక్షుడు ప్రభుశంకర్‌, సీనియర్‌ నాయకులు విజయ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు నక్కల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 12:05 AM