Share News

ఆలయాల్లో వైభవంగా కల్యాణోత్సవాలు

ABN , Publish Date - May 21 , 2024 | 12:13 AM

మేడ్చల్‌ మున్సిపల్‌ పరిధిలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, బీరప్ప కామరాతీ దేవి కల్యాణోత్సవ కార్యక్రమం సోమవారం వైభవంగా నిర్వహించారు.

ఆలయాల్లో వైభవంగా కల్యాణోత్సవాలు
స్వామి వారిని దర్శించుకుంటున్న పీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌

మేడ్చల్‌ టౌన్‌, మే 20: మేడ్చల్‌ మున్సిపల్‌ పరిధిలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, బీరప్ప కామరాతీ దేవి కల్యాణోత్సవ కార్యక్రమం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ వేడుకల్లో పాల్గొనడానికి మేడ్చల్‌ పట్టణానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీసులు పొందారు. ప్రతీ సంవత్సరం వైభవంగా నిర్వహించే బీరప్ప కామరాతీదేవి కల్యాణోత్సవంలో పాల్గొనటానికి విచ్చేసే భక్తుల కోసం నిర్వాహకులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ నియోజక వర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి, పీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్‌యాదవ్‌ పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మేడ్చల్‌ పట్టణ మాజీ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు శిమకుమార్‌ యాదవ్‌, స్వామి యాదవ్‌, కౌడె మహేస్‌ పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 12:13 AM