క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగు
ABN , Publish Date - Jan 27 , 2024 | 12:17 AM
క్రీడాలతో వ్యక్తుల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడుతాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు పల్లె రజినీకాంత్గౌడ్ తన తల్లి బాలమణి స్మారకార్థం ఆదిభట్ల మున్సిపల్ కేంద్రంలో నిర్వహిస్తున్న ఆదిభట్ల ప్రీమియర్ లీగ్-7క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం సీనియర్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్, జడ్పీటీసీ మహిపాల్లతో కలిసి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు.
ఆదిభట్ల, జనవరి 26 : క్రీడాలతో వ్యక్తుల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడుతాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు పల్లె రజినీకాంత్గౌడ్ తన తల్లి బాలమణి స్మారకార్థం ఆదిభట్ల మున్సిపల్ కేంద్రంలో నిర్వహిస్తున్న ఆదిభట్ల ప్రీమియర్ లీగ్-7క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం సీనియర్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్, జడ్పీటీసీ మహిపాల్లతో కలిసి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో శారీరక ధృడత్వంతో పాటు మానసిక ఆరోగ్యస్థితి మెరుగు పడుతుందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని, అప్పుడే జీవితంలో ఏదైనా సాధించవచ్చని మల్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిభట్ల మున్సిపాలిటీ అధ్యక్షుడు బాల్రాజ్గౌడ్, నాయకులు గురునాథ్రెడ్డి, పాండు రంగారెడ్డి, చేగూరి శ్రీనివా్స, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.