Share News

మానవత్వం చాటిన ఇబ్రహీంపట్నం పోలీసులు

ABN , Publish Date - Jan 23 , 2024 | 12:40 AM

మతి స్థిమితం సరిగాలేని ఓ వృద్ధురాలిని సోమవారం ఇబ్రహీంపట్నం పోలీసులు చేరదీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ బాలాపూర్‌కు చెందిన నేనావత్‌ నవీన్‌ వద్దఉంటున్న వాళ్ల నాయనమ్మ చండి(70)కు కొంతకాలంగా మతి స్థిమితం సరిగా ఉండటం లేదు.

మానవత్వం చాటిన ఇబ్రహీంపట్నం పోలీసులు

మతి స్థిమితం సరిగాలేని వృద్ధురాలిని చేరదీసి కుటుంబ సభ్యులకు అప్పగింత

ఇబ్రహీంపట్నం, జనవరి 22: మతి స్థిమితం సరిగాలేని ఓ వృద్ధురాలిని సోమవారం ఇబ్రహీంపట్నం పోలీసులు చేరదీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ బాలాపూర్‌కు చెందిన నేనావత్‌ నవీన్‌ వద్దఉంటున్న వాళ్ల నాయనమ్మ చండి(70)కు కొంతకాలంగా మతి స్థిమితం సరిగా ఉండటం లేదు. ఇబ్రహీంపట్నం పరిధి ఉప్పరిగూడ వెళ్లే రోడ్డులో ఉన్న ఆమెను గస్తీ చేస్తున్న ఎస్సై రామకృష్ణ, కానిస్టేబుళ్లు ప్రేమలత, రాజులు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. భోజనం పెట్టి ఆమె వద్ద ఉన్న సంచిలో దొరికిన ఫోన్‌నంబర్‌ ఆధారంగా మనవడు నవీన్‌కు ఫోన్‌ చేశారు. స్టేషన్‌ వచ్చిన మనవడికి ఆమెను అప్పగించారు. మూడు రోజుల క్రితం ఆమె ఇంటినుంచి వెళ్లిందని నవీన్‌ తెలిపాడు.

Updated Date - Jan 23 , 2024 | 08:25 AM