Share News

కిస్తీలు కట్టమన్నందుకు కారుకే నిప్పంటించాడు

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:33 PM

ఫైనాన్స్‌పై తెచ్చుకున్న కారు కిస్తీలు చెల్లించాలని ఫైనాన్స్‌ కంపెనీ, కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి పెరగంతో ఏకంగా తన కారుకే ఓ వ్యక్తి నిప్పంటించిన ఘటన షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది.

కిస్తీలు కట్టమన్నందుకు కారుకే నిప్పంటించాడు

షాద్‌నగర్‌రూరల్‌, మార్చి 9 : ఫైనాన్స్‌పై తెచ్చుకున్న కారు కిస్తీలు చెల్లించాలని ఫైనాన్స్‌ కంపెనీ, కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి పెరగంతో ఏకంగా తన కారుకే ఓ వ్యక్తి నిప్పంటించిన ఘటన షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ ప్రాంతానికి చెందిన మూర్తి అనే వ్యక్తి హైదరాబాద్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతడు శ్రీరాం ఫైనాన్స్‌లో ఒక సెకండ్‌హ్యాండ్‌ షిఫ్డ్‌ కారును కొన్నాడు. అందుకోసం ఫైనాన్స్‌లో రూ.5లక్షలు తీసుకున్నట్లు సమాచారం. చివరి కిస్తీ చెల్లించాల్సి ఉంది. అది కూడా చెల్లించాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో శనివారం రాత్రి షాద్‌నగర్‌ సమీపంలోని ఓ వెంచర్‌లో మూర్తి తన కారుకు నిప్పంటించాడు. సమాచారం తెలుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రతా్‌పలింగంను వివరణ కోరగా మూర్తి మానసికస్థితి సరిగా లేక పోవడం వల్లే కారును దగ్ధం చేశాడని తెలిపారు.

Updated Date - Mar 09 , 2024 | 11:33 PM