19క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:28 AM
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పట్టుకున్నట్లు శామీర్పేట పోలీసులు తెలిపారు.

మూడుచింతలపల్లి, జూన్ 11: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పట్టుకున్నట్లు శామీర్పేట పోలీసులు తెలిపారు. ప్రజాపంపిణీ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తునారని వచ్చిన విశ్వసనీయ సమాచారంతో శామీర్పేట్ ఆర్ఐ కుమార్, పోలీసులు సంయుక్తంగా బొమ్మరాశిపేట ఓఆర్ఆర్సర్వీస్ రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానస్పదంగా వెళ్తున్న మహేంద్ర వాహనాన్ని ఆపి పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. ఆ వాహనంలో 19క్వింటాళ్ల బియ్యం సుమారు 50సంచుల్లో తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనంతో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. నాగాయిపల్లి తండాకు చెందిన బానోత్ సంతోష్ ఎలాంటి అనుమతులు లేకుండా బియ్యాన్ని నేరేడ్మెట్ పరిసరాల్లో కొనుగులు చేసి మూడుచింతలపల్లి మండలంలో విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఆర్ఐ కుమార్ ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసుకుని వాహనాన్ని, బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ సప్లయి గోదాంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.