వేధింపులు తాళలేకే బలవన్మరణం
ABN , Publish Date - May 30 , 2024 | 12:18 AM
అప్పుల బాధతో శామీర్పేట మండలం తుర్కపల్లికి చెందిన రుద్రబోయిన మహేందర్ (35) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.
![వేధింపులు తాళలేకే బలవన్మరణం](https://media.andhrajyothy.com/media/2024/20240511/5_RR_29_81afc8c78f.jpg)
సెల్ఫీ వీడియోలో రోదిస్తూ వివరాలు వెల్లడించిన మృతుడు
పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబీకులు, గ్రామస్తుల ఆందోళన
మూడుచింతలపల్లి, మే 29 : అప్పుల బాధతో శామీర్పేట మండలం తుర్కపల్లికి చెందిన రుద్రబోయిన మహేందర్ (35) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. అయితే ఆత్మహత్యకు ముందు మహేందర్ రోదిస్తూ ఉన్న సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. తాను రూ.6లక్షలు అప్పు తీసుకొని రూ.4.70 లక్షలు చెల్లించినా, ఆ డబ్బంతా మిత్తికే సరిపోతుందని అప్పు ఇచ్చిన వారు అం టున్నారని, వారి వేధింపులు తాళలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని మహేందర్ సూసైడ్ నోట్తో పాటు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వీడియోలో రోది స్తూ మాట్లాడాడు. అప్పు తీర్చాలని వేధించి మహేందర్ మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని అతడి కుటుంబీకులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. బుధవారం రాజీవ్ రహదారిపై జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. సీఐ యాదయ్య మాట్లాడుతూ వేధింపులకు కారణమైన వ్యక్తి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని బాధిత కుటుంబీకులకు భరోసా ఇవ్వడంతో వారు వెనుతిరిగారు. అనంరతం గ్రామంలో మహేందర్ అంత్యక్రియలు నిర్వహించారు.