Share News

ఘనంగా గోదాదేవి దీపోత్సవం

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:32 PM

ఎదులాబాద్‌లోని గోదాసమేతమన్నార్‌ రంగనాయకస్వామి ఆలయంలో మంగళవారం ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా గోదాదేవికి దీపోత్సవం నిర్వహించారు.

ఘనంగా గోదాదేవి దీపోత్సవం
అమ్మవారికి దీపోత్సవం నిర్వహిస్తున్న మహిళాభక్తులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, జనవరి 9: ఎదులాబాద్‌లోని గోదాసమేతమన్నార్‌ రంగనాయకస్వామి ఆలయంలో మంగళవారం ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా గోదాదేవికి దీపోత్సవం నిర్వహించారు. తెల్లవారుజామున్నే అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. పండితులు గోదాదేవికి తిరుప్పావై ఆలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఎదులాబాద్‌ సింగిల్‌విండో డైరెక్టర్‌ చందుపట్ల ధర్మారెడ్డి ధనుర్మాస ఉత్సవాల్లో నెలరోజుల పాటు ఆలయంలో పూలతో ప్రత్యేక ఆలంకరణ చేపడుతారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు టీపీ లక్ష్మణాచార్యులు, గోవిందాచార్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 11:32 PM