ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:36 PM
ధాన్యం కొనుగోళ్లను ప్రక్రియను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ తెలిపారు.
కులకచర్ల, ఏప్రిల్ 25: ధాన్యం కొనుగోళ్లను ప్రక్రియను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ తెలిపారు. కులకచర్లలో కొనసాగుతున్న ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. సరైన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని, తాలు లేకుండా శుభ్రం చేసిన వరి ధాన్యాన్ని చూసి కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు ధృవీకరించిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయించి మిల్లులకు తరలించాలని నిర్వాహకులను సూచించారు. వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. అనంతరం కులకచర్లలో పలు ఫర్టిలైజర్స్ దుకాణాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏవో వీరస్వామి, కేంద్రం ఇంచార్జ్ వెంకట్, రైతులు పాల్గొన్నారు.