Share News

భగవద్గీత శ్లోకాల పోటీల్లో కవితకు గోల్డ్‌ మెడల్‌

ABN , Publish Date - May 29 , 2024 | 12:04 AM

బెంగళూరు దత్త పీఠం నిర్వహించిన భగద్గీత శ్లోకాల పోటీల్లో కడ్తాలకు చెందిన కవితసంపత్‌కుమార్‌కు గోల్డ్‌మెడల్‌ లభించింది.

భగవద్గీత శ్లోకాల పోటీల్లో కవితకు గోల్డ్‌ మెడల్‌
కవితసంపత్‌కుమార్‌ను సత్కరిస్తున్న గంప వెంకటేశ్‌

కడ్తాల్‌, మే 28 : బెంగళూరు దత్త పీఠం నిర్వహించిన భగద్గీత శ్లోకాల పోటీల్లో కడ్తాలకు చెందిన కవితసంపత్‌కుమార్‌కు గోల్డ్‌మెడల్‌ లభించింది. భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసి చెప్పినందుకు గాను ఆమెకు బంగారు పతకం లభించింది. జాతీయ స్థాయి పోటీల్లో గోల్డ్‌మెడల్‌ సాధించిన కవితను మంగళవారం కడ్తాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమానికి నిర్వహించగా డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌ హాజరయ్యారు. కవితను పూలమాలలు, శాలువాలతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో కడ్తాల మండల ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు గంప శ్రీనివా్‌సగుప్తా, ప్రధాన కార్యదర్శి రామగుప్తా, ఉపాధ్యక్షుడు పద్మనారాయణ, యువజన అధ్యక్షుడు వీరేందర్‌గుప్తా, రఘు, వీరేశ్‌, రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 12:04 AM