జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:08 AM
ఫరూఖ్నగర్ మండలం బూర్గులలో నిషేధిత పేలుడు పదార్థాల(జిలెటిన్ స్టిక్స్)ను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ ప్రతా్పలింగం, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డిలు గురువారం తెలిపారు.
షాద్నగర్ రూరల్, ఏప్రిల్ 18: ఫరూఖ్నగర్ మండలం బూర్గులలో నిషేధిత పేలుడు పదార్థాల(జిలెటిన్ స్టిక్స్)ను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ ప్రతా్పలింగం, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డిలు గురువారం తెలిపారు. చింతగూడకు చెందిన యాదయ్య రాళ్లు, గుట్టలు పగుల గొట్టేందుకు ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్ను కలిగి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దాంతో వారు తనిఖీ చేయగా అతడి వద్ద 59 జిలెటిన్ స్టిక్స్ లభించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.