పచ్చళ్ల తయారీలో మహిళలకు ఉచిత శిక్షణ
ABN , Publish Date - Mar 09 , 2024 | 12:28 AM
మహిళలకు పచ్చళ్లు, కారం పొడులు, తృణ ధాన్యాలతో స్నాక్స్ తయారీపై శిక్షణ ఇస్తామని యూనియన్ బ్యాంక్ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ స్వర్ణ భారత్ ట్రస్ట్ సంస్థ సంచాలకులు కృష్ణ శుక్రవారం తెలిపారు.
వికారాబాద్, మార్చి 8: మహిళలకు పచ్చళ్లు, కారం పొడులు, తృణ ధాన్యాలతో స్నాక్స్ తయారీపై శిక్షణ ఇస్తామని యూనియన్ బ్యాంక్ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ స్వర్ణ భారత్ ట్రస్ట్ సంస్థ సంచాలకులు కృష్ణ శుక్రవారం తెలిపారు. మార్చి 11 నుంచి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, 19ఏళ్ల నుంచి 45సంవత్సరాల్లోపు మహిళలు శిక్షణకు రావొచ్చని తెలిపారు. పది రోజులు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. రేషన్/ఆధార్ కార్డు, పాస్పోర్ట సైజు ఫొటోలు, అన్ని రకాల జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలన్నారు. ఫుడ్ ప్రాడక్ట్స్ తయారీలో కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకం స్కీములను శిక్షకులకు వర్తిం పజేస్తామన్నారు. పీఎంఎ్ఫఎంఈ కింద 35శాతం దాకా సబ్సిడీ లోను ఇప్పించ గలుగుతామని, మహిళలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అన్ని రకాలుగా చేయూతనిస్తామన్నారు. శిక్షణ కాలంలో ఉచిత హాస్టల్, భోజన వసతులు, యూనిఫాం కల్పిస్తామన్నారు. వివరాలకు 9391487797, 9177141712, 9618534720, 6301890681 నబర్లలో సంప్రదించాలన్నారు.