Share News

ఉద్యోగం ఇప్పిస్తానని రూ.80వేలు తీసుకుని మోసం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:36 AM

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని ఓ వ్యక్తి మోసం చేశాడని బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఉద్యోగం ఇప్పిస్తానని రూ.80వేలు తీసుకుని మోసం

పూడూరు, ఏప్రిల్‌ 18: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని ఓ వ్యక్తి మోసం చేశాడని బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెన్‌గోముల్‌ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కొప్పుల గోవర్ధన్‌రెడ్డి కూతురు వర్షితకు ఈనెల 6వ తేదీన సెల్‌: 7369343354 నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. జాబ్‌కు ఎంపికయ్యావని, ఇంటి వద్దే ఉండి చేయవచ్చని మాయమాటలు చెప్పాడు. అంతేకాకుండా వర్షిత నుంచి రూ.80వేలు ఆన్‌లైన్‌ ద్వారా వసూలు చేశాడు. తర్వాత ఎలాంటి సమాచారం లేకపోవడంతో వర్షిత తండ్రి గోవర్ధన్‌రెడ్డి తన కూతురుకి జాబ్‌ ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని చెన్‌గోముల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించినట్లు ఎస్‌ఐ మదుసూదనరెడ్డి తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 07:38 AM