చికిత్స పొందుతూ రైతు మృతి
ABN , Publish Date - Jan 03 , 2024 | 11:52 PM
ఆర్థిక సమస్యలతో చితికిపోయిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పూనుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
![చికిత్స పొందుతూ రైతు మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చౌదరిగూడం, జనవరి 3: ఆర్థిక సమస్యలతో చితికిపోయిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పూనుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. చౌదరిగూడ మండలం పద్మారం గ్రామానికి చెందిన బొమ్మగళ్ల నర్సింలు(30), భార్య శివలీల, కూతురు శ్రీజ, సిద్దూలు ఉన్నారు. కాగా, నర్సింలుకు 30 గంటల వ్యవసాయ పొలం ఉంది. అందులో పత్తిని సాగు చేశాడు. కానీ, ఆశించిన మేర పంట దిగుబడి రాకపోవడంతో పాటు పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేనేమోనన్న బాధతో తరచూ బాధపడేవాడు. ఈక్రమంలో గత నెల 31న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పూనుకున్నాడు. చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని ఎస్ఐ సక్రం తెలిపారు. మృతుడి భార్య శివలీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.