బస్సు దిగుతూ పడి వృద్ధురాలికి గాయాలు
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:57 PM
ఆర్టీసీ బస్సు నుంచి దిగే క్రమంలో ఓ వృద్ధురాలు జారిపడి తీవ్రంగా గాయపడింది.
కేశంపేట, ఆగస్టు 24: ఆర్టీసీ బస్సు నుంచి దిగే క్రమంలో ఓ వృద్ధురాలు జారిపడి తీవ్రంగా గాయపడింది. గ్రామస్తుల వివరాల మేరకు.. కాకునూర్ కు చెందిన సత్తమ్మ(77) శనివారం షాద్నగర్ వెళ్లి బస్సులో తిరిగి వస్తుండగా కేశంపేటలోని వైఎస్సార్ చౌరస్తాలో బస్సు దిగుతూ మెట్లపై నుంచి జారిపడిండి. ఇది గమనించని డ్రైవర్ బస్సును ముందుకు నడపడంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. సత్తమ్మకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు.