చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి
ABN , Publish Date - Mar 28 , 2024 | 11:53 PM
రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన వృద్ధురాలు చికిత్సపొందుతూ గురువారం మృతిచెందింది.
ఘట్కేసర్ రూరల్, మార్చి 28: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన వృద్ధురాలు చికిత్సపొందుతూ గురువారం మృతిచెందింది. ఈ ఘటన పోచారం ఐటీసీ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ బి.రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన కర్రె యాదమ్మ(80) బుధవారం తన కూతురుతో కలిసి పోచారం మున్సిపల్, యంనంపేట్లోని సోదరుడి ఇంటికి రావడానికి యంనంపేట్ శ్రద్ధ ఆసుపత్రి వద్ద ఆటోదిగారు. రోడ్డు దాటుతుండగా రాంపల్లి నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ యాదమ్మను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.