‘కాంగ్రెస్తోనే బలహీన వర్గాల అభివృద్ధి’
ABN , Publish Date - Feb 27 , 2024 | 12:20 AM
కాంగ్రెస్ పార్టీతోనే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి అన్నారు.
![‘కాంగ్రెస్తోనే బలహీన వర్గాల అభివృద్ధి’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
శంకర్పల్లి, ఫిబ్రవరి 26 : కాంగ్రెస్ పార్టీతోనే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి అన్నారు. సోమవారం శంకర్పల్లి మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ సంధ్యారాణి, మాజీ ఎంపీటీసీ అశోక్కుమార్ బీఆర్ఎస్ పార్టీని విడిచి సునీతామహేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఆమె నివాసంలో కాంగ్రె్సలో చేరారు. ఆమె వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రె్సతోనే సాధ్యమన్నారు. వైస్చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు సంతోష్, నాయకులు ప్రకాశ్గుప్తా, మధు, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.