డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:41 AM
అక్రమంగా నిల్వచేసిన పేలుడు పదార్థాలను యాచారం మండలంలోని కొత్తపల్లిలో రాచకొండ ఎస్వోటీ బుధవారం రాత్రి పట్టుకుంది.

యాచారం, జూలై 4 : అక్రమంగా నిల్వచేసిన పేలుడు పదార్థాలను యాచారం మండలంలోని కొత్తపల్లిలో రాచకొండ ఎస్వోటీ బుధవారం రాత్రి పట్టుకుంది. కొత్తపల్లికి చెందిన వెంకటయ్య, రవిలు తమ పంట పొలంలో ఉన్న భారీ బండరాళ్లను ధ్వంసం చేసి పంటభూమిని వినియోగంలోకి తేవడానికి పేలుడు పదార్థాలను నగరంలో కొనుగోలు చేశారు. ముందుగా పోలీసుల అనుమతి తీసుకోకుండా కొనుగోలు చేసి నిల్వచేసినట్లు ఎస్వోటీకి పక్కా సమాచారమందింది. దాంతో దాడిచేసి 18 డిటోనేటర్లు, 68 జిలెటిన్ స్టిక్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకర్కుమార్ చెప్పారు.