కుక్కల దాడిలో జింక మృత్యువాత
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:09 AM
మండల పరిధిలోని మక్తగూడ గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున కుక్కల దాడిలో జింక మృతిచెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం..
కొత్తూర్, ఏప్రిల్ 18: మండల పరిధిలోని మక్తగూడ గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున కుక్కల దాడిలో జింక మృతిచెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మక్తగూడ గ్రామ శివారులో ఓ జింక వస్తుండగా.. కుక్కలు దాడిచేశాయి. తీవ్ర గాయాలు కావడంతో గ్రామస్తులు జింకకు నీరు తాగించే ప్రయత్నం చేశారు. రెండు గంటల తర్వాత జింక మృతిచెందింది. గ్రామస్తులు కొత్తూర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతిచెందిన జింకను అటవీశాఖ సిబ్బంది శంషాబాద్ సమీపంలో ఉన్న అటవీ పార్కుకు తరలించారు.