Share News

విద్యుదాఘాతంతో ఆవులు, గేదెలు మృత్యువాత

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:38 PM

విద్యుదాఘాతంతో రెండు ఆవులు, రెండు గేదెలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన కొడంగల్‌ మండలంలోని సంగాయిపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది.

విద్యుదాఘాతంతో ఆవులు, గేదెలు మృత్యువాత

కొడంగల్‌ రూరల్‌, జూన్‌ 4: విద్యుదాఘాతంతో రెండు ఆవులు, రెండు గేదెలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన కొడంగల్‌ మండలంలోని సంగాయిపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కురిసిన భారీ వర్షానికి గ్రామ శివారులో గల సంజీవరెడ్డి పొలంలో ఆదివారం విద్యుత్‌ స్తంభం కిందపడిపోవడంతో విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. ఈ విషయంపై లైన్‌మన్‌కు సమాచారం అందించడంతో లైన్‌మన్‌ విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఈ క్రమంలో మంగళవారం ఆ తెగిపడిన తీగలకు విద్యుత్‌ సరఫరా అయిన విషయం ఎవరికీ తెలియకపోవడంతో పశువులు, గేదెల మేత కోసం వదిలిపెట్టడంతో విద్యుదాఘాతంతో ఒక్కసారిగా రెండు ఆవులు, గేదెలు మృత్యువాతపడ్డాయి. బాధిత రైతులు నర్సింహారెడ్డి, బల్వంత్‌రెడ్డి, బిచ్చిరెడ్డి, నారాయణరెడ్డిలు తమకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించాలని కోరారు.

Updated Date - Jun 05 , 2024 | 08:38 AM