విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాత
ABN , Publish Date - Jun 11 , 2024 | 12:00 AM
విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాతపడింది . ఈఘటన మండలంలోని ఎన్కెపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
![విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాత](https://media.andhrajyothy.com/media/2024/20240604/10_PUDOOR_2_974c99cd4b.jpg)
పూడూరు, జూన్ 10: విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాతపడింది . ఈఘటన మండలంలోని ఎన్కెపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కిష్టం గోపాల్ అనే రైతు సోమవారం తన ఆవును మండలంలోని హిట్స్ కాలేజీ సమీపంలో మేత కోసం తీసుకెళ్లాడు. అక్కడ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుదాఘాతానికి గురై ఆవు మృత్యువాతపడింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన ఆవు మృతిచెందిందని బాధితుడు రైతు కిష్టం గోపాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆవు విలువ రూ.60వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు.