గ్రామాల అభివృద్ధికి నిరంతర కృషి
ABN , Publish Date - Jan 18 , 2024 | 11:28 PM
మండలంలోని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎంపీపీ గోవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం ఆలంకన్గూడ గ్రామంలో ఎంపీపీ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
శంకర్పల్లి, జనవరి 18: మండలంలోని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎంపీపీ గోవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం ఆలంకన్గూడ గ్రామంలో ఎంపీపీ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పారు. గ్రామాల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోవిందమ్మ, ఎంపీడీవో వెంకయ్య, సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.