Share News

చేవెళ్ల సభకు తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:35 AM

చేవెళ్లలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభకు వికారాబాద్‌ పట్టణం నుంచి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మందికి పైగా వాహనాల్లో పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు.

చేవెళ్ల సభకు తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు
ఇందిరాగాంధీ వ్రిగహం వద్ద నివాళులర్పిస్తున్న డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, తదితరులు

వికారాబాద్‌, ఫిబ్రవరి 28: చేవెళ్లలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభకు వికారాబాద్‌ పట్టణం నుంచి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మందికి పైగా వాహనాల్లో పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ స్పీకర్‌, స్థానిక ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలు సభకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ కిషన్‌ నాయక్‌, సర్ఫరాజ్‌, రెడ్యానాయక్‌, మురళి, వేణుగోపాల్‌రెడ్డి, ఆసిఫ్‌, శ్రీనివాస్‌ ముదిరాజ్‌, రాజ్‌కుమార్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

పరిగి: చేవెళ్లలో జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి సభకు పరిగి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. పరిగి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ టి.రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా తరలివెళ్లారు. అన్ని మండలాల నుంచి పరిగికి చేరుకున్నారు. పరిగిలోని ఇందిరాగాంధీ విగ్రహానికి మంగళవారం సాయంత్రం పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేవెళ్ల సభకు తరలివెళ్లినవారిలో బ్లాక్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు సిద్దాంతి పార్థసారథి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.లాల్‌కృష్ణప్రసాద్‌, డీసీసీ కార్యదర్శులు బి.భీంరెడ్డి, కె.హన్మంత్‌, పట్టణ అధ్యక్షుడు ఇ.కృష్ణ, పరిగి, దోమ, కులకచర్ల, చౌడాపూర్‌, గండీడ్‌ మండలాల అధ్యక్షులు బి.పరశురాంరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, బీఎస్‌ ఆంజనేయులు, అశోక్‌, జితేందర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌, తావుర్యానాయక్‌, రాములునాయక్‌, అశోక్‌రెడ్డి, అశోక్‌ పాల్గొన్నారు.

మోమిన్‌పేట్‌: మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పార్టీ మండల అధ్యక్షుడు మన్నె శంకర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో మంగళవారం చేవెళ్లలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు సుభా్‌షగౌడ్‌, సిరాజుద్దీన్‌, సురేందర్‌, గిరిసింగ్‌, ఏరాజ్‌పాష, చంద్రయ్య, సుభాష్‌, శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పూడూరు: చేవెళ్లలో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభకు పూడూరు మండలం నుంచి కాంగ్రెస్‌ నాయకులు తరలివెళ్లారు. మండలంలోని మన్నెగూడ చౌరస్తా వద్ద మంగళవారం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి జెండా ఊపి బహిరంగసభకు తరలివెళ్లారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 12:35 AM