Share News

కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:26 AM

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ   అధికారంలోకి రావడం ఖాయం
సమావేశంలో మాట్లాడుతున్న వంశీచంద్‌రెడ్డి

కొత్తూర్‌, ఏప్రిల్‌ 7 : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. మండల కేంద్రంలోని గణపతి గార్డెన్స్‌లో ఆదివారం కాంగ్రెస్‌ కొత్తూర్‌ మున్సిపాలిటీ, కొత్తూర్‌, నందిగామ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వారు హాజరై మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రె్‌సలో చేరగా వారికి వంశీచంద్‌రెడ్డి, శంకర్‌ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యాసుందర్‌రెడ్డి, కొత్తూర్‌, నందిగామ మండలాల అధ్యక్షులు గొంగళ్ల హరినాథ్‌రెడ్డి, జంగ నర్సింహా, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, చంద్రపాల్‌రెడ్డి, కుమారస్వామిగౌడ్‌, నాయకులు శివశంకర్‌గౌడ్‌, తులసీరాంనాయక్‌, గోవర్దన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:27 AM