కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీలు
ABN , Publish Date - Apr 14 , 2024 | 12:09 AM
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ సమన్వయ కమిటీలను నియమించినట్లు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి పేర్కొన్నారు.
![కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మేడ్చల్, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ సమన్వయ కమిటీలను నియమించినట్లు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి పేర్కొన్నారు. ఈ కమిటీలు మే 13న లోకసభ ఎన్నికలు ముగిసేంత వరకు పనిచేస్తాయన్నారు. మేడ్చల్ కమిటీలో వజ్రే్షయాదవ్, శరత్చంద్రారెడ్డి, ప్రభాకర్గౌడ్, మహ్మద్ ముజీబుద్దీన్, పి.అమరేందర్రెడ్డి, పి.హరిబాబు, ఉప్పల్కు ఎం.పరమేశ్వర్రెడ్డి, స్వర్ణరాజశివమణి, రజితారెడ్డి, బి.శ్రీదేవి, జలీల్పాషా, గడ్డం యాదగిరి, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంకు మైనంపల్లి హన్మంతరావు, రాజ జితేంద్రనాథ్, ఎన్.అశోక్రెడ్డి, వెంకటేశ్యాదవ్, టి.లక్ష్మీకాంత్రెడ్డి, కంటోన్మెంట్కు వెన్నెల, అమరేందర్రెడ్డి, రాజు, యాదగిరి, బాబురావు, వెంకటేశ్, కూకట్పల్లికి బండి రమేష్, సత్యం శ్రీరంగం, పి.నాగిరెడ్డి, టి.వేణు, పి.విఠల్రెడ్డి, పుష్పరెడ్డి, సంధ్యారాణి, రాజేందర్, బషీర్భాయ్లతో సమన్వయ కమిటీలను నియమించినట్లు పేర్కొన్నారు.