సివిల్ ర్యాంకర్కు అభినందనల వెల్లువ
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:02 AM
యూపీఎస్సీ నిర్వహించిన జాతీయ స్థాయి సివిల్స్ పరీక్షలో 231వ ర్యాంకు సాధించిన తరుణ్కు పలువురు అభినందనలు తెలిపారు. పూడూరు మండలం మంచన్పల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన తరుణ్ తొలి ప్రయత్నంలోనే మెరుగైన ర్యాంకు సాధించారు.
పరిగి/పూడూరు, ఏప్రిల్ 17: యూపీఎస్సీ నిర్వహించిన జాతీయ స్థాయి సివిల్స్ పరీక్షలో 231వ ర్యాంకు సాధించిన తరుణ్కు పలువురు అభినందనలు తెలిపారు. పూడూరు మండలం మంచన్పల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన తరుణ్ తొలి ప్రయత్నంలోనే మెరుగైన ర్యాంకు సాధించారు. ఈమేరకు బుధవారం పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, ఎంపీపీ మల్లేశం, తదితరులతో పాటు వివిధ ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పరిగి ఏఎంసీ మాజీ చైర్మన్ సురేందర్, జీహెచ్ఎంలు అంజిలయ్య, బుగ్గయ్య, నాయకులు లక్నపూర్ శ్రీనివాస్, బిచ్చన్న, వెంకటయ్య, నర్సింహరాజు, కృష్ణ, రాజేందర్, లాలయ్య, నరేందర్, సుధాకర్, నర్సింహులు, కరుణాకర్, గంగాధర్, ఆంజనేయులు, భీమయ్య, నవీన్ తదితరులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా తరుణ్ మట్టిలో మాణిక్యమని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దోమ అమర్నాథ్ అన్నారు. జిల్లా శాఖ ఆధ్వర ్యంలో తరుణ్ నివాసానికి వెళ్లి సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు టి.వెంకటయ్య, ఉపాధ్యక్షుడు మఽధుసూదన్, పూడూరు మండల శాఖ అధ్యక్షుడు జహంగీర్, ప్రధాన కార్యదర్శి అంజిలయ్య, పరిగి మండల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.