కొండా విశ్వేశ్వర్రెడ్డికి ఎమ్మార్పీఎస్ శుభాకాంక్షలు
ABN , Publish Date - Jun 05 , 2024 | 11:27 PM
చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డిని ఎమ్మార్పీఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
![కొండా విశ్వేశ్వర్రెడ్డికి ఎమ్మార్పీఎస్ శుభాకాంక్షలు](https://media.andhrajyothy.com/media/2024/20240604/05_TANDUR_RURAL_1_4f71c2206a.jpg)
తాండూరు రూరల్, జూన్ 5 : చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డిని ఎమ్మార్పీఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని విశ్వేశ్వర్రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భం గా విశ్వేశ్వర్రెడ్డి వారితో మాట్లాడుతూ బీజేపీ గెలుపు కోసం కృషిచేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు, గడపగడపకూ బీజేపీ కోసం ప్రచారం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ ఆశయ సాధనకు తన, అలాగే పార్టీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ప్రకాష్, ఎంఎ్సపీ జిల్లా ఉపాధ్యక్షుడు పి.నర్సింహులు, కొడిగంటి మల్లికార్జున్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.