Share News

యూట్యూబ్‌ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

ABN , Publish Date - Jul 10 , 2024 | 12:23 AM

యూట్యూబ్‌ ఛానల్‌లో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై లేనిపోని ఆరోపణలు చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని కోటమర్పల్లి గ్రామస్థులు మోమిన్‌పేట్‌ సీఐ ఆంజనేయులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

యూట్యూబ్‌ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

మర్పల్లి, జూలై 9: యూట్యూబ్‌ ఛానల్‌లో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై లేనిపోని ఆరోపణలు చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని కోటమర్పల్లి గ్రామస్థులు మోమిన్‌పేట్‌ సీఐ ఆంజనేయులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. మూడు రోజుల కిందట ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో బెల్టు షాపులపై ప్రచారం చేసిన వార్తకు స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారని, ఆ యూట్యూబ్‌ ఛానల్‌ వ్యక్తులపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలన్నారు. తమ గ్రామంలో గత పదేళ్లుగా ఎలాంటి మద్యం విక్రయాలు లేవని, ఇక ముందు కూడా ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ గ్రామ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు అంజయ్య, నర్సింహారెడ్డి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2024 | 09:11 AM