Share News

విద్యారులకు చికాగో వైద్య బృందం పరీక్షలు

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:46 PM

అమెరికాలోని చికాగో వైద్య యూనివర్సిటీ రిసెర్చ్‌ సెంటర్‌ బృందం గురువారం ఫరూఖ్‌నగర్‌ మండలం రాయికల్‌ ్గగ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించింది.

విద్యారులకు చికాగో వైద్య బృందం పరీక్షలు
వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న చికాగో వైద్య విద్యార్థులు

షాద్‌నగర్‌, జనవరి 11 : అమెరికాలోని చికాగో వైద్య యూనివర్సిటీ రిసెర్చ్‌ సెంటర్‌ బృందం గురువారం ఫరూఖ్‌నగర్‌ మండలం రాయికల్‌ ్గగ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించింది. ఈ సందర్భంగా రెడ్డి ల్యాబ్స్‌, నైస్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు వెస్లీ, వెంకట్‌తో పాటు చికాగోకు చెందిన వైద్య విద్యార్థులు పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విద్యార్థుల చేత యోగా ఆసనాలు వేయించారు. విద్యార్థులంతా ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం యోగా సాధన చేయాలని వైద్యులు విద్యార్థులకు సూచించారు. యోగా చేయడం ద్వారా బుద్ధిబలం పెరగడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని చెపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 11:46 PM