Share News

కేంద్ర పథకాలే విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తాయి

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:06 AM

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని కేంద్ర ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయని బీజేపీ మండలాధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లేశ్‌యాదవ్‌ అన్నారు. బుధవారం మండలంలోని కోటమర్పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

కేంద్ర పథకాలే విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తాయి
తాండూరు: మరికంబ కాలనీలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సతీమణి సంగీతారెడ్డి

మర్పల్లి, ఏప్రిల్‌ 17: చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని కేంద్ర ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయని బీజేపీ మండలాధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లేశ్‌యాదవ్‌ అన్నారు. బుధవారం మండలంలోని కోటమర్పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అన్నపూర్ణ, నాయకులు శ్రీధర్‌రెడ్డి, లక్ష్మణ్‌, మధుసూదన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రమేశ్‌, సంతో్‌షరెడ్డి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామ నవమి వేడుకల్లో కొండా తనయుడు

వికారాబాద్‌/ధారూరు : చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనయుడు విశ్వజిత్‌రెడ్డి ధారూరు మండల పరిధిలోని ధారూరు, నాగారం, స్టేషన్‌ ధారూరు గ్రామాల్లో బుధవారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా వికారాబాద్‌లోని రామాలయంలో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌తో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయనవెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు పాండుగౌడ్‌, విశ్వనాథం, రమేశ్‌, వివేకానందరెడ్డి, రాజేందర్‌గౌడ్‌, రాజునాయక్‌, నందు, సాయిగౌడ్‌, అనిల్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి

తాండూరు/యాలాల : ప్రతీ ఒక్కరు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని, దేశంలో మోదీ నాయకత్వంలో కొనసాగుతున్న రామరాజ్యం చేవెళ్ల ప్రాంతంలోను రావాలని కొండా సంగీతారెడ్డి ఆకాంక్షించారు. తాండూరు పట్టణంలోని మరికాంబ కాలనీ, సీసీఐ కాలనీల్లో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాండూరు పట్టణానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా యాలాల మండలం జంటుపల్లి రామస్వామిని సంగీతారెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని దేవుడిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.

సీతారాముల కల్యాణంలో పాల్గొన్న విశ్వేశ్వర్‌రెడ్డి

షాబాద్‌ : షాబాద్‌ మండలంలోని సీతారాంపూర్‌ రగ్రామంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్వహించిన సీతారాముల కల్యాణంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శంషాబాద్‌ రూరల్‌ : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్కూడలోని అమ్మపల్లి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్ధి కొండా విశేశ్వర్‌రెడ్డి, ఆయన సతీమణి సంగీతారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్‌, మైలార్‌దేవుపల్లి కార్పొరేటర్‌ తోకల శ్రీనివా్‌సరెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Apr 18 , 2024 | 12:06 AM