కేంద్ర పథకాలను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Jan 21 , 2024 | 12:00 AM
కేంద్ర పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ అన్నారు. శనివారం జిల్లేడ్ చౌదరిగూడ మండలం జిల్లేడ్, ముష్ఠిపల్లి, రావిర్యాల, పీర్జాపూర్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
చౌదరిగూడ, జనవరి 20 : కేంద్ర పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ అన్నారు. శనివారం జిల్లేడ్ చౌదరిగూడ మండలం జిల్లేడ్, ముష్ఠిపల్లి, రావిర్యాల, పీర్జాపూర్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్ర నాయకులు అందె బాబయ్య, ఏవో కృష్ణమోహన్, ఎంపీహెచ్వో ప్రభులింగం, ఏఈవో రాజేశ్వరి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కమ్మరి భూపాలచారి, బీజేపీ మండలాధ్యక్షుడు కురుమయ్య, రాజు, బ్యాంకు సిబ్బంది శివ, మోహన్, సరళ, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.
బ్యాంక్ సేవలను సద్వినియోగపర్చుకోవాలి
మహేశ్వరం, జనవరి 20 : కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న అనేక రకాల పథకాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ జీఎం రమేష్ అన్నారు. శనివారం మండల పరిధిలోని సిరిగిరిపురంలో బ్యాంక్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులనుద్ధేశించి ఆయన మాట్లాడుతూ రూపే కార్డు ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాసుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.