Share News

కారు-బైక్‌ ఢీ.. యువకుడికి గాయాలు

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:43 PM

బైక్‌ను కారుఢీ కొనడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

కారు-బైక్‌ ఢీ.. యువకుడికి గాయాలు

యాచారం, జనవరి 1 : బైక్‌ను కారుఢీ కొనడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం మహేష్‌(18) బైక్‌పై గడ్డమల్లాయగూడ నుంచి కందుకూరు మండలం కొలన్‌గూడకు వెళ్తున్నాడు. గున్‌గల్‌ సమీపంలో వెనక నుంచి వచ్చిన కారు ఢీకొంది. దీంతో మహేష్‌ కాలు విరిగి గాయపడ్డాడు. అతడిని పెట్రో మొబైల్‌ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మహేష్‌ నగర శివారు మల్లాపూర్‌ నివాసి. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని, సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా కారును, డ్రైవర్ను గుర్తించామని, డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని సీఐ సైదయ్య తెలిపారు.

Updated Date - Jan 01 , 2024 | 11:43 PM