Share News

తాళం వేసిన రెండిళ్లలో చోరీ

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:03 AM

తాళం వేసిన రెండిళ్లలో చోరీ జరిగింది. ఈ ఘటన పోచారం ఐటీసీ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

తాళం వేసిన రెండిళ్లలో చోరీ

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 16: తాళం వేసిన రెండిళ్లలో చోరీ జరిగింది. ఈ ఘటన పోచారం ఐటీసీ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్మాయిల్‌ఖాన్‌గూడ శ్రీ సాయినగర్‌ కాలనీకి చెందిన ముత్యాల మహేష్‌ ఈనెల 13వ తేదీన బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం ఇంటి చుట్టుపక్కల వారు ఇంటితాళం పగులగొట్టి ఉందని మహే్‌షకు ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో హుటాహుటిన ఇంటికి వచ్చి చూసేసరికి బీరువాలో భద్రపరిచిన 10గ్రాముల బంగారు ఆభరణాలు, 300గ్రాముల వెండి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటన చౌదరిగూడలోని పద్మావతీ కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన పడుమటి రామిరెడ్డి ఈనెల 14వ తేదీన ఇంటికి తాళంవేసి కుటుంబసభ్యులతో కలిసి యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూర్‌ మండల కేంద్రంలో నిర్వహించే శుభకార్యానికి వెళ్లాడు. అదేరోజు రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. దీంతో లోపలికి వెళ్లి చూసేసరికి బీరువాలో భద్రపరిచిన 15తులాల బంగారు ఆభరణాలు, రూ.4లక్షల నగదు కనిపించలేదు. దీంతో రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 17 , 2024 | 12:03 AM