Share News

నవీన్‌రెడ్డి విజయం పట్ల బీఆర్‌ఎస్‌ నాయకుల సంబురాలు

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:07 AM

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌ రెడ్డి విజయం పట్ల బీఆర్‌ఎస్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆమనగల్లు, కడ్తాల మండల కేంద్రాలలో ఆదివారం ఫలితాలు వెలువడగానే అ పార్టీ నాయకులు పెద్దఎత్తున సంబురాలు జరుపుకున్నారు.

నవీన్‌రెడ్డి విజయం పట్ల బీఆర్‌ఎస్‌ నాయకుల సంబురాలు
కొత్తూర్‌లో జ్యోతిరావుఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి

ఆమనగల్లు, కడ్తాలలో ర్యాలీలు

బాణసంచా పేల్చి మిఠాయిల పంపిణీ

ఆమనగల్లు/కడ్తాల్‌/కొత్తూర్‌/చౌదరిగూడ, జూన్‌ 2: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌ రెడ్డి విజయం పట్ల బీఆర్‌ఎస్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆమనగల్లు, కడ్తాల మండల కేంద్రాలలో ఆదివారం ఫలితాలు వెలువడగానే అ పార్టీ నాయకులు పెద్దఎత్తున సంబురాలు జరుపుకున్నారు. హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేటీఆర్‌, ఎమ్మెల్సీగా ఎన్నికైన నవీన్‌ రెడ్డిలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ఆయా మండల కేంద్రాలలో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రలోభాలకు గు రి చేసినా బీఆర్‌ఎస్‌ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు జట్టుకట్టి పార్టీ అభ్యర్థిని గెలిపించారన్నారు. డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, ఎంపీటీసీలు గోపాల్‌, లచ్చిరామ్‌ నాయక్‌, కుమార్‌, మంజుల చంద్రమౌళి, ప్రియ రమేశ్‌, సరితపంతూనాయక్‌, కౌన్సిలర్‌ రాధమ్మవెంకటయ్య, నాయకులు జోగువీరయ్య, హరిచంద్‌ నాయక్‌, సేవ్యనాయక్‌, వెంకటయ్య, రమేశ్‌, అల్లాజీ, సైదులుగౌడ్‌, దోనాదుల సత్యం, గన్యనాయక్‌, అంజి, లాయక్‌అలీ, మంగళపల్లి నర్సింహ, సయ్యద్‌ ఖలీల్‌, తదితరులు పాల్గొన్నారు.

కొత్తూర్‌లో నవీన్‌రెడ్డికి ఘనస్వాగతం

ఎమ్మెల్సీగా గెలుపొంది బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కలుసుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్తున్న ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డిని కొత్తూర్‌ వద్ద ఆ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఆయన కొత్తూర్‌కు చేరుకోగానే శాలువాలు, పూలమాలతో సన్మానించారు. చౌరస్తాలోని జ్యోతిరావుఫూలే విగ్రహానికి నవీన్‌కుమార్‌రెడ్డి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, బి.దేవేందర్‌యాదవ్‌, కడెంపల్లి శ్రీనివా్‌సగౌడ్‌, యాదయ్య, జె. శ్రీను, సోమ్లానాయక్‌, గోపాల్‌గౌడ్‌, శివచారి, రవినాయక్‌ తదితరులు స్వాగతం పలికారు. కాగా, నవీన్‌రెడ్డి గెలపుపట్ల చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్లలో బీఆర్‌ఎస్‌ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. పెద్ద ఎల్కిచర్లలో టపాసులు పేల్చి, కేక్‌ కట్‌ చేసి అభిమానులకు పంచిపెట్టారు.

ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ గెలుపుపై సంబురాలు

నవాబుపేట, జూన్‌ 2: మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపొందడం పట్ల మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌ గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ టపాసులు పేల్చారు.

Updated Date - Jun 03 , 2024 | 12:07 AM