చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:19 AM
మండలంలోని ఎర్రవల్లి గ్రామచెరువులో చేపలు పట్టేందుకు వెల్లి ప్రమాదవశాత్తు నీటమునిగి గల్లంతైన ఎరుకల చిన్న అనంతయ్య(60)మృతదేహం లభ్యమయింది.
![చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
వికారాబాద్, ఏప్రిల్ 2: మండలంలోని ఎర్రవల్లి గ్రామచెరువులో చేపలు పట్టేందుకు వెల్లి ప్రమాదవశాత్తు నీటమునిగి గల్లంతైన ఎరుకల చిన్న అనంతయ్య(60)మృతదేహం లభ్యమయింది. సోమవారం రాత్రి వరకు బోటు, గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా రాత్రి 11గంటల సమయంలో అనంతయ్య మృతదేహం లభ్యమైంది. మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.