బైకు దొంగ అరెస్టు.. మూడు వాహనాలు స్వాధీనం
ABN , Publish Date - Feb 17 , 2024 | 12:03 AM
బైకు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఆదిభట్ల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి నుంచి గతంలో దొంగిలించిన మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు.
![బైకు దొంగ అరెస్టు.. మూడు వాహనాలు స్వాధీనం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆదిభట్ల, ఫిబ్రవరి 16 : బైకు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఆదిభట్ల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి నుంచి గతంలో దొంగిలించిన మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు. సీఐ రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని బాపులపాడు మండలం విజయవాడకు చెందిన షేక్ అబ్ధుల్వలీ అలియాస్ బాజీ బాషా ఆదిభట్ల మున్సిపాలిటీ బొంగ్లూరులో తల్లి, సోదరుడితో కలిసి ఉంటూ పెయింటర్గా పనిచేస్తుండేవాడు. కొన్ని రోజులుగా బైకుల చోరీలకు పాల్పడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు నిఘా పెట్టి శుక్రవారం అరెస్టుచేసి నట్లు సీఐ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. గతంలో చోరీ చేసిన మూడు బైకులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.