Share News

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీఫాం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:42 AM

బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ బీఫాంలు అందజేశారు. ఈమేరకు మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు రాగిడి లక్ష్మారెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, క్యామ మల్లే్‌షలకు తెలంగాణ భవన్‌లో గురువారం బీఫాం అందజేశారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీఫాం
భీఫాం అందుకుంటున్న చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌

ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌/ఇబ్రహీంపట్నం/చేవెళ్ల, ఏప్రిల్‌ 18 : బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ బీఫాంలు అందజేశారు. ఈమేరకు మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు రాగిడి లక్ష్మారెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, క్యామ మల్లే్‌షలకు తెలంగాణ భవన్‌లో గురువారం బీఫాం అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, బీఆర్‌ఎస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేషం, దయానందర్‌ గుప్తా, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జి.జగదీ్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:42 AM