గడప గడపకు అయోధ్య రామయ్య అక్షింతలు
ABN , Publish Date - Jan 03 , 2024 | 11:55 PM
పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని అయ్యప్ప ఆలయంలో శ్రీరాముడి అక్షింతలకు ప్రత్యేక పూజలు చేసి ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు.
![గడప గడపకు అయోధ్య రామయ్య అక్షింతలు](https://media.andhrajyothy.com/media/2023/20231205/3gksr2_684e5d8fe4.jpg)
ఘట్కేసర్, జనవరి 3: పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని అయ్యప్ప ఆలయంలో శ్రీరాముడి అక్షింతలకు ప్రత్యేక పూజలు చేసి ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్రెడ్డి, వైస్చైర్మన్ రెడ్డియానాయక్, కమిషనర్ వేమనారెడ్డి, నాయకులు శంకర్రెడ్డి, చిన్న నర్సింహులుగౌడ్, శంకర్గౌడ్, కేఎం రెడ్డి, యదగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్: మండలంలోని అవుషాపూర్లో బుధవారం అయోధ్య రామయ్య అక్షింతలు గడప గడపకు పంపిణీ చేశారు. గ్రామంలోని ఉమామహేశ్వరాలయంలో అక్షింతలకు సర్పంచ్ ఏనుగు కావేరిమశ్చేందర్రెడ్డి ప్రత్యేకపూజలు నిర్వహించి గ్రామంలో ఊరేగించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏనుగు మశ్చేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.