Share News

ఆటో అపహరించిన నిందితుడి రిమాండ్‌

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:58 PM

మద్యానికి బానిసై పార్కింగ్‌ చేసిన ఆటోను అపహరించిన నిందితున్ని పోచారం ఐటీసీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఆటో అపహరించిన నిందితుడి రిమాండ్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌, మార్చి 28: మద్యానికి బానిసై పార్కింగ్‌ చేసిన ఆటోను అపహరించిన నిందితున్ని పోచారం ఐటీసీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ బీ.రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడకు చెందిన నానావత్‌ చందర్‌ ఈనెల 26 రాత్రి తన బజాజ్‌ ఆటోను పార్క్‌చేశాడు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి ఇంటిముందు ఆటో కనిపించలేదు. పరిసరాల్లో వెతికినా అచూకీ లభ్యం కాలేదు. దీంతో నానావత్‌ చందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు యంనంపేట్‌ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరే్‌షకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తానే ఆటోను అపమరించి యాదగిరిగుట్ట వద్ద పార్కింగ్‌లో పెట్టినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రలోని శివారెడ్డిగూడెంకు చెందిన వీరభద్ర వీరే్‌షకుమార్‌ కూలీ పనులు చేసుకుంటూ మద్యానికి బానిసయ్యాడు. అయితే, నిందితుడి వద్ద నుంచి ఆటోను స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్‌కు తరలించామని, ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 11:58 PM