Share News

ఏప్రిల్‌ 4న ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌పై అవిశ్వాసం

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:53 PM

ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరిపై అవిశ్వాస ఓటింగ్‌ కోసం ఏప్రిల్‌ 4వ తేదీని ఖరారు చేస్తూ కలెక్టర్‌ శశాంక ఉత్తర్వులు జారీ చేశారు.

ఏప్రిల్‌ 4న ఇబ్రహీంపట్నం మున్సిపల్‌  వైస్‌ చైర్మన్‌పై అవిశ్వాసం

ఉత్తర్వులు జారీచేసిన కలెక్టర్‌ శశాంక

ఇబ్రహీంపట్నం, మార్చి 22: ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరిపై అవిశ్వాస ఓటింగ్‌ కోసం ఏప్రిల్‌ 4వ తేదీని ఖరారు చేస్తూ కలెక్టర్‌ శశాంక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి అవిశ్వాసం ప్రకటించిన కౌన్సిలర్లకు శుక్రవారం నోటీసులు అందజేశారు. కాగా, మున్సిపాలిటీలో మొత్తం 24 మంది సభ్యులుండగా.. వైస్‌ చైర్మన్‌ యాదగిరి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినప్పటికీ అధికార కాంగ్రె్‌సకు చెందిన 10 మందికితోడు ఆరుగురు బీఆర్‌ఎస్‌ సభ్యులు కలిసి 16 మంది అవిశ్వాసాన్ని ప్రకటించారు. 20 రోజులుగా వీరు ఇతర రాష్ట్రాల్లో క్యాంపులో ఉన్నారు. కాగా, ఇబ్రహీంపట్నం ఆర్డీవో కె.అనంతరెడ్డి ప్రిసైడింగ్‌ అధికారిగా ఓటింగ్‌ చేపట్టనున్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:53 PM