విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:54 PM
విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఐసీఎస్ అధికారి బోయల్ డేవిస్ అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని యంనంపేట్లోని రావ్వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.

ఘట్కేసర్, జనవరి 12: విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఐసీఎస్ అధికారి బోయల్ డేవిస్ అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని యంనంపేట్లోని రావ్వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రధానంగా విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు తదితర విభాగాల్లో ప్రావీణ్యం పొందాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ వి.శేషగిరిరావు, ప్రొఫెసర్ షకీల్ అహ్మద్, విధుర లెర్నింగ్ సీఈవో ఆదిత్యకుమార్, బాల్రాజ్నాయుడు, సీఐ అశోక్రెడ్డి, పాఠశాల చైర్మన్ రామానాయుడు, సీఈవో సుబ్రహ్మణ్యం, హెచ్ఎం శ్రీరంజని, బోధనా సిబ్బంది పాల్గొన్నారు.