రైలుకింద పడి గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్య
ABN , Publish Date - Feb 26 , 2024 | 12:10 AM
రైలుకింద పడి గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. సుమారు 20-25 సంవత్సరాల వయస్సు కలిగిన యువకుడు ఆదివారం ఉదయం 9.00 గంటల ప్రాంతం లో గుర్తుతెలియని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
![రైలుకింద పడి గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్య](https://media.andhrajyothy.com/media/2024/20240224/kk_c2b182b773.jpg)
షాద్నగర్ రూరల్, పిబ్రవరి 25: రైలుకింద పడి గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. సుమారు 20-25 సంవత్సరాల వయస్సు కలిగిన యువకుడు ఆదివారం ఉదయం 9.00 గంటల ప్రాంతం లో గుర్తుతెలియని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కాగా, మృతుడి శరీరంపై పసుపు రంగు టీషర్టు, లేత నీలిరంగు ప్యాంట్(చెక్స్) ఉన్నట్లు చెప్పారు. ఆచూకీ తెలిసినవారు 9441407039, 9848090426 నెంబర్లను సంప్రదించి సమాచారం ఇవ్వాలని హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్ కోరారు.