Share News

రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN , Publish Date - May 03 , 2024 | 12:02 AM

వికారాబాద్‌ రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు గూడ్స్‌ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్‌ఐ శంకరయ్య తెలిపారు.

రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

వికారాబాద్‌, మే 2; వికారాబాద్‌ రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు గూడ్స్‌ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్‌ఐ శంకరయ్య తెలిపారు. మృతుడి వద్ద వికారాబాద్‌ నుంచి బీదర్‌ కి వెళ్లే రైలు టికెట్‌ మాత్రమే లభించింది. వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి మార్చారీకి తరలించారు. వ్యక్తి ఆచూకీ తెలిసినట్లయితే 9989355134కు సంప్రదించాలన్నారు.

Updated Date - May 03 , 2024 | 12:02 AM