మేడిపల్లిలో పురాతన విగ్రహం లభ్యం
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:50 PM
యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో పురాతన విగ్రహం లభ్యమైంది. శుక్రవారం గ్రామానికి చెందిన యువకులు మైదానం ఏర్పాటుకు కంపచెట్లు, బండరాళ్లు తొలగిస్తుండగా పురాతన విగ్రహం కనిపించింది.
యాచారం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో పురాతన విగ్రహం లభ్యమైంది. శుక్రవారం గ్రామానికి చెందిన యువకులు మైదానం ఏర్పాటుకు కంపచెట్లు, బండరాళ్లు తొలగిస్తుండగా పురాతన విగ్రహం కనిపించింది. ఈ విషయం గ్రామస్తులకు సమాచారం అందించడంతో వచ్చి పరిశీలించారు. ఇది అక్కన్న మాదన్న కాలం నాటిది కావొచ్చని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.