బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి రిమాండ్
ABN , Publish Date - May 31 , 2024 | 11:47 PM
పాఠశాలకు వెళ్తున్న బాలికను బలవంతంగా లొంగదీసుకొని లైంగికదాడికి పాల్పడిన నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల గ్రామానికి చెందిన కొజ్జెంకి సుదర్శన్ అదే గ్రామానికి చెందిన ఓ బాలిక(17) పాఠశాలకు వెళ్తుండగా..
![బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి రిమాండ్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చేవెళ్ల, మే 31 : పాఠశాలకు వెళ్తున్న బాలికను బలవంతంగా లొంగదీసుకొని లైంగికదాడికి పాల్పడిన నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల గ్రామానికి చెందిన కొజ్జెంకి సుదర్శన్ అదే గ్రామానికి చెందిన ఓ బాలిక(17) పాఠశాలకు వెళ్తుండగా.. ఆమెను తన కారులో తీసుకెళ్లి దింపుతానని నమ్మించాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని బాలికను బెదిరించాడు. ఈక్రమంలో మే 28న బాలిక కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేయడంతో పోలీ్సలు నిందితుడు కొజ్జెంకి సుదర్శన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం ఒప్పుకోవడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నేరానికి ఉపయోగించిన కారును సీజ్ చేశారు. సుదర్శన్ను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.